గోరంట్ల మండలం కల్లితాండాకు శనివారం చేరుకున్న వీర జవాన్ మురళినాయక్ పార్థివ దేహంను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వారిని మంత్రి సవితమ్మ ఓదార్చారు. అలాగే గ్రామ ప్రజలు మురళి నాయక్ మృతదేహాన్ని చూడడానికి పెద్ద ఎత్తున తరలివచ్చి బోరుమని ఏడ్చారు. అక్కడ ఉన్న యువకులు పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.