ఇల్లూరు: నీట మునిగి యువకుడు మృతి

80చూసినవారు
ఇల్లూరు: నీట మునిగి యువకుడు మృతి
గార్లదిన్నె గ్రామ సమీపంలోని ఓ బావిలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ఓ యువకుడు మృతి చెందాడు. ఇల్లూరు గ్రామానికి చెందిన ఎస్‌.బాబావలి గురువారం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు వదిలాడు. అక్కడున్న వారు వెంటనే చుట్టుపక్కల వారికి తెలియజేగా వారు బావిలో కూరుకుపోయిన మృతదేహాన్ని అతికష్టం మీద బయటికి తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్