గూగుడు గ్రామంలో కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు, రేపు, ఎల్లుండి మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్ తెలిపారు. ఎవరైనా రహస్యంగా విక్రయాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేలాది మంది భక్తుల తరలివస్తుండటంతో బందోబస్తు చర్యలు చేపట్టామని వివరించారు.