పుట్లూరు మండలం కొండుగారికుంట గ్రామంలో టీడీపీ నేత సుదర్శన్ నాయుడు తోటలోని అరటి పంటను శుక్రవారం గుర్తు తెలియని దుండగులు నరికి వేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ తోటను పరిశీలించారు. టీడీపీ నేత అరటి పంటను నరికి వేయడం దారుణమని ఆయన అన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.