శింగనమల నియోజకవర్గంలోని రైతులకు సూక్ష్మ నీటి సాగు పథకం కింద రాయితీపై డ్రిప్, స్పింక్లర్లను ఎమ్మెల్యే బండారు శ్రావణి పంపిణీ చేశారు. బుధవారం నార్పల హైస్కూల్ గ్రౌండ్ లో రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. వైసీపీ హయాంలో కన్నా అధిక శాతం రాయితీతో వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశామన్నారు. గత పాలకులు రైతులను మోసం చేశారని మండిపడ్డారు. రైతు శ్రేయస్సు కోసం సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని తెలిపారు.