ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడం చారిత్రాత్మక మైలురాయని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అన్నారు. గురువారం ఆమె క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా మంత్రుల కమిటీ సిఫారసులతో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. 200 పాయింట్ల రోస్టర్ విధానం ప్రకారం రిజర్వేషన్లు సమానంగా పొందేలా చర్యలు చేపట్టడమే ఇందుకు నిదర్శనం అని అన్నారు