శింగనమల మండల పరిధిలోని తరిమెల గ్రామానికి చెందిన బోయ లింగమయ్య వ్యవసాయంలో గిట్టుబాటు ధర లేక వేసిన పంటలో నష్టాలు రావడంతో అప్పుతెచ్చుకున్నవారికి డబ్బులు కట్టలేక తీవ్ర మనోవేదనకు గురై బుధవారం గుండెపోటు వచ్చి మృతి చెందారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా రైతు లింగమయ్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.