యల్లనూరు మండలంలోని వేములపల్లి, పెద్దమల్లేపల్లి గ్రామాలలో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లను గురువారం పంచాయతీ రాజ్ డీఈ అరుణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాలలోని కాలనీలలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడరాదనితెలిపారు.పడరాదని తెలిపారు. కార్యక్రమంలో మండల ఇంజినీర్ నరేంద్రబాబు, సచివాలయ ఇంజినీర్లు మనోజ్, ప్రసాద్ పాల్గొన్నారు.