అషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా తాడిపత్రి స్థానిక బుగ్గ రామలింగేశ్వరుడికి శుక్రవారం అన్నాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్టు చైర్మన్ పోలిశెట్టి ఆంజనేయులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి హాజరవుతారన్నారు. ఉదయం అమ్మవారి పంచలోహ విగ్రహానికి పంచామృత అభిషేకంతో పూజలు ప్రారంభిస్తామన్నారు.