అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఓ వ్యక్తికి ఉద్యోగ ఉపాధ్యాయ సేవా సంస్థ సభ్యులు ఆదివారం ఆర్థికసాయం అందించారు. యాడికి మండలం రాయల చెరువు గ్రామానికి చెందిన అబ్దుల్ రజాక్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబాన్ని పోషించలేక ఆర్థికంగా ఇబ్బం దులు పడుతున్నాడు. అతన్ని గుర్తించిన ఉద్యోగ, ఉపాధ్యాయ సేవాసంస్థ నాయకులు రూ. 7, 600 నగదు అందించారు.