పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య విస్తరణ అధికారి కంబగిరి, ఆశా కార్యకర్త సావిత్రిపై మంగళవారం తేనెటీగలు దాడి చేసి గాయపరిచాయి. గర్భిణులకు వంట తయారు చేస్తున్న తరుణంలో ఒక్క సారిగా తేనెటీగలు ఎక్కడి నుంచో వచ్చి వీరిపై దాడి చేశాయి. ఈదాడిలో ఆరోగ్య విస్తరణ అధికారితో పాటు ఆశా కార్యకర్తకు గాయాలయ్యాయి. వీరిలో సావిత్రి పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు