యాడికి చేరిన వినాయక విగ్రహాలు

57చూసినవారు
యాడికి చేరిన వినాయక విగ్రహాలు
వినాయక పండుగ సమీపిస్తూ ఉండడంతో మండల కేంద్రం యాడికిలో ముందస్తు సందడి నెలకొంది. కొందరు వినాయక విగ్రహాల అమ్మకం దారులు ఈసారి కొద్ది రోజులు ముందుగానే విగ్రహాలను తెప్పించి ప్రదర్శనగా ఉంచారు. ఎన్నడూ లేనంతగా ఈ ఏడు రక రకాల ఆకృతుల్లో గణనాథులు మండల భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. స్థానిక వారపు సంత ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఖాళీ కళ్యాణ మండపంలో గణనాథులను విక్రయించడానికి వ్యాపారులు సంసిద్ధం అయ్యారు.

సంబంధిత పోస్ట్