తాడిపత్రి మండలంలో పర్యటించిన జర్మనీ దేశస్థులు

58చూసినవారు
తాడిపత్రి మండలంలో పర్యటించిన జర్మనీ దేశస్థులు
తాడిపత్రి మండలం ముచ్చుకోట, యర్రగుంటపల్లి గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ అధికారి డి పి ఎం లక్ష్మణ్ నాయక్, జర్మనీ దేశస్థులు విస్తృతంగా బుధవారం పర్యటించారు. ఇక్కడి రైతులు సాగుచేస్తున్న వివిధ రకాల ప్రకృతి వ్యవసాయ పంటలను జర్మనీ దేశస్థులు వీక్షించారు. రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమితో పాటు మనిషి ఆరోగ్యం బాగుంటుందని వారికి రైతులు వివరించారు.

సంబంధిత పోస్ట్