తాడిపత్రి అల్లర్ల కేసులో వ్యక్తి అరెస్ట్

74చూసినవారు
తాడిపత్రి అల్లర్ల కేసులో వ్యక్తి అరెస్ట్
తాడిపత్రిలో ఎన్నికల అల్లర్లకు సంబంధించి ఓ వ్యక్తిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల పోలింగ్, తరువాత రోజుల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించిన కేసుల్లో సంజీవ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. గానుగ వీధిలో ఉన్న సదరు వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా సదరు వ్యక్తి పై రౌడీ షీటు కూడా నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్