పెద్దవడుగూరు మండలంలోని రావులుడికిలో బసిరెడ్డి శంకర్ రెడ్డి (55) విద్యుత్తు ప్రమాదానికి గురై మృతి చెందాడు. శనివారం విద్యుత్తు సరఫరా లేకపోవడంతో డిపి వద్ద ఫీజు వేసే ప్రయత్నం చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.