
ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానున్న చార్ ధామ్ యాత్ర
హిందూ యాత్రలలో అత్యంత పవిత్రమైనది చార్ధామ్ యాత్ర. హిమాలయ పర్వతాల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించేందుకు భక్తులు ఈ యాత్ర చేపడుతారు. అయితే ఈ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పాల్గొనాలనుకుంటే అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి. ఇంకా డెహ్రాడూన్, హరిద్వార్, గుప్తకాశి, సోన్ప్రయాగ్ కేంద్రాలలో ఆఫ్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.