తాడిపత్రి మండలంలోని బోడాయిపల్లికి చెందిన నాగవర్ధన్ రెడ్డి ఈనెల 12న ఇంటర్ ఫలితాలను తెలుసుకునేందుకు తాడిపత్రికి వచ్చాడు. ఫలితాలు చూసు కొని ఫెయిల్ కావడంతో ఇంటికి వెళ్లకుండా పారిపోయాడు. బాలుడి తండ్రి పుల్లారెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి తిరుపతిలో ఉన్న విద్యార్థిని తీసుకువచ్చి బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు.