తాడిపత్రి పట్టణంలో పోలీసులు శనివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఐ సాయి ప్రసాద్ తన సిబ్బందితో కలిసి స్టేషన్ పరిసర ప్రాంతాలలో అపరిశుభ్ర వాతావరణం లేకుండా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల ప్రాంతాలలో అపరిశుభ్రత లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.