ప్రజల్లో ధైర్యం నింపేందుకే సాయుధ బలగాలచే కవాతు నిర్వహిస్తున్నామని తాడిపత్రి డీఎస్పీ కె. జనార్దన్ నాయుడు పేర్కొన్నారు. బుధవారం తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డు, క్రిష్ణాపురం రోడ్డు, టైలర్స్ కాలనీ, జయనగర్ కాలనీ, యల్లనూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఏపిఎస్పీ ఫోర్సు సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించారు.