యాడికి మండలం రాయలచెరువు జాతీయ రహదారి పక్కన ఓ పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యానికి సంబంధించి ముగ్గురిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల క్రితం 270 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో పోలీసులు విచారణ జరిపిన అనంతరం ప్యాపిలి మండలం రంగాపురం గ్రామానికి చెందిన సుంకన్న, రాయలచెరువుకు చెందిన మెకానిక్ బాబు, పొలం యజమాని నరసింహులు బియ్యం నిల్వలకు సంబంధించిన వారీగా గుర్తించారు.