ఈ కేవైసీ పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డు దారులు ఈ కేవైసీని త్వరగా పూర్తి చేసుకోవాలని యాడికి మండల తహసిల్దార్ ప్రతాప్ రెడ్డి మంగళవారం తెలిపారు. మండలంలోని రేషన్ దుకాణాల వద్ద పెండింగ్ జాబితా ఉందన్నారు. రెవెన్యూ అధికారులు, రేషన్ డీలర్లు లబ్ధిదారుల కేవైసీ ని పూర్తి చేయాలని సూచించారు. ఈ నెలాఖరులోపు ఈ కేవైసీ గడువు ముగియనున్నట్లు ఆయన తెలిపారు.