నేడు ఉరవకొండకు సీఎం చంద్రబాబు

72చూసినవారు
నేడు ఉరవకొండకు సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు నేడు (శుక్రవారం) అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. రాయలసీమకు జీవనాడిగా ఉన్న హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీనిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆయన ఉరవకొండ వెళ్లనున్నారు. 2025 జూన్ లోపు ప్రాజెక్టు ఫేజ్-1 పనులను పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకోవడంతో, ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ పనులు తుది దశకు చేరుకున్నాయి.

సంబంధిత పోస్ట్