వజ్రకరూరు మండలం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సర్పంచ్ మోనాలిసా ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం శాంతిరాం హాస్పిటల్ కర్నూల్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వజ్రకరూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మోనాలిసా తదితరులు హాజరై ప్రారంభించారు. సర్పంచ్ మోనాలిసా మాట్లాడుతూ ఈ శిబిరాన్ని మండల వ్యాప్తంగా చాలా మంది ఉపయోగించుకున్నారని అన్నారు.