అనంతపురం నగరంలోని స్థానిక ఆర్. అండ్. బి అతిథి గృహంలో హెచ్. ఎన్. ఎస్. ఎస్ ( హంద్రీనీవా సుజల స్రవంతి) అధికారులతో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు, నీటి కేటాయింపులు, పెండింగ్ పనులు, సమస్యలపై మంత్రి చర్చించారు. హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేసిన తర్వాత త్వరితగతిన ఉప కాలువలకు కూడా నీటిని విడుదల చేయాలన్నారు.