కూడేరు మండలంలోని కూడేరు, అంతరగంగా అంగన్వాడి సెంటర్లను శనివారం ఐసిడిసి ప్రాజెక్టు సిడిపిఓ శ్రీదేవి తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్రంలోని పిల్లల హాజరు, రికార్డులు, తదితర విషయాలను పరిశీలించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతినెల 5వ తారీకు జరిగే ఎడ్యుకేషన్ చైల్డ్ ఎర్లీ డే సందర్భంగా పిల్లలకు పాటలు, ఆటల పోటీలు, నంబరింగ్ ఆటలు నిర్వహించామని తెలిపారు.