ఉరవకొండ: కంది పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారి

83చూసినవారు
ఉరవకొండ: కంది పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారి
విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామంలోని రైతు సేవ కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి పెన్నయ్య శుక్రవారం సందర్శించారు. అనంతరం గ్రామంలో రైతులు ఆరబోసిన కంది పంటను ఆయన పరిశీలించారు. కంది పంటకు ప్రభుత్వ మద్దతు ధర రూ. 7750లు ఉందని రైతులకు తెలిపారు. నాణ్యత ఉన్న కంది పంటకు కొనుగోలు అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏఈఓ రాఘవేంద్ర, ఆర్బీకే సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్