ఉరవకొండలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దేశాన్ని రక్షించే శక్తి ప్రధాని మోడీకి ఉందన్నారు. టెర్రరిస్టుల దాడులతో దేశం చలించిపోయిందని, హింసకు ప్రపంచంలో తావు లేదని చెప్పారు. ఉగ్రవాదులతో పోరాటంలో వీర మరణం పొందిన మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దేశ రక్షణకు సైనికుల బలిదానం అమూల్యమన్నారు.