వజ్రకరూరు మండలం ఛాయాపురం పర్యటనకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బందోబస్తు నేపథ్యంలో గురువారం కాన్వాయ్ రీహార్సల్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ పి. జగదీష్ పర్యవేక్షణలో కేటాయించిన ప్రదేశాలలో పోలీసు సిబ్బంది, అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలు, ఆయా మార్గాల గుండా కాన్వాయ్ కొనసాగింది.