ఉరవకొండ: పేద విద్యార్థులకు తల్లికి వందనం ఒక వరం లాంటిది

71చూసినవారు
బెళుగుప్ప మండలం అంకంపల్లిలో నిరుపేద కుటుంబానికి తల్లికి వందనం పథకం ఎంతో ఊరటనిచ్చింది. గ్రామానికి చెందిన గంగమ్మ, ఓబులేష్ దంపతులకు ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. అందరికి ఈ పథకం వర్తించిందని గంగమ్మ తెలిపారు. శనివారం ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి రూ. 13వేలు చొప్పున మొత్తం రూ. 78వేలు లబ్ధి కలగడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఒకరికే అమ్మఒడి అందిందని చెప్పారు.
Job Suitcase

Jobs near you