ఉరవకొండ మండలం పెన్నహోబిలం గ్రామంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం స్వామివారు సూర్య ప్రభ వాహనముపై ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఉభయదారులు యం. నారాయణ స్వామివారి కుటుంబ సభ్యులు, అనంతపురం ఆలయ కార్యనిర్వహణ అధికారి యస్. రమేష్ బాబు, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తాదులు పాల్గొన్నారు.