ఉరవకొండ పట్టణంలోని జగనన్న లేఔట్లను విజిలెన్స్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయంలో లేఔట్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, భూ యజమానుల వివరాలను విజిలెన్స్ అధికారులు సేకరించారు. రైతుల నుంచి తక్కువ ధరలకు కొని ఎక్కువ ధరలకు విక్రయించారా లేదా అన్న కోణంలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.