ఉరవకొండ: ప్రభుత్వ పాఠశాలలోని వస్తువులను ధ్వంసం చేసిన ఆకతాయిలు

74చూసినవారు
ఉరవకొండ: ప్రభుత్వ పాఠశాలలోని వస్తువులను ధ్వంసం చేసిన ఆకతాయిలు
ఉరవకొండలో సెంట్రల్ ప్రాథమిక పాఠశాలలో గుర్తు తెలియని దుండగులు విధ్వంసం సృష్టించారు. పాఠశాలకు సెలవులు ఉన్న సమయంలో గ్రిల్ తలుపులు పగలగొట్టి రెండు ఫ్యాన్లు చోరీ చేశారని ప్రధానోపాధ్యాయులు నసీరాబేగం బుధవారం విలేఖరులకు తెలిపారు. ఫ్లోరింగ్ టైల్స్, స్విచ్ బోర్డులు, మోటార్ స్టాటర్ బోర్డులను ధ్వంసం చేసి తరగతి గదుల్లో మద్యం సేవించి, బాటిళ్లు పగలగొట్టి, మూత్రవిసర్జన చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్