అనంతపురం జిల్లాను అన్ని రంగాల్లో మూడవ స్థానానికి వచ్చేలా ప్రణాళిక వేసుకుని పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గురువారం సాయంత్రం వజ్రకరూర్ మండలం ఛాయాపురం గ్రామంలో హెలిప్యాడ్ వద్ద ఆర్టికల్చర్, ఏపీఎంఐపి, డ్వామా, గ్రౌండ్ వాటర్, అగ్రికల్చర్, డిఆర్డిఏ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, పిఆర్ ఎస్ఈ తదితర జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా తెలుగు జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇరిగేషన్ కు సంబంధించి డ్రోన్స్ ను భిన్నమైన టైమ్స్ లో డిఫరెంట్ లేయర్స్ పెట్టుకొని, ప్రతిరోజు ఒక పని పెట్టుకొని రోజుకు ఎంత పనికి వినియోగించాము అనేది చూసుకోవాలన్నారు.