విడపనకల్లులోని ప్రభుత్వ బాలికల హాస్టల్లో దోమల నివారణకు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మలేరియా శాఖ అధికారులు మలాథిన్ మందు స్ప్రే చేయించారు. సబ్ యూనిట్ ఆఫీసర్ కోదండరామిరెడ్డి ఆదేశాలతో సిబ్బంది సుమారు స్ప్రే చేయించారు. దోమల నివారణకు ఈ చర్యలు చేపట్టినట్లు సిబ్బంది తెలిపారు. శుభ్రత పాటించాలని వారు కోరారు