ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ కేబినెట్ అనంతరం సీఎం పలు కీలక సూచనలు చేశారు. అన్నదాత సుఖీభవకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్రం మరో రూ.14 వేలు (మొత్తం రూ. 20 వేలు) కలిపి ఇచ్చే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. కేంద్రంతోపాటు మూడు విడతలుగా రాష్ట్రం ఆర్థిక సాయం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపారు.