కొండాపురం పట్టణంలోని స్టేట్ బ్యాంక్ బస్టాప్ వద్ద 11 కేవీ విద్యుత్ స్తంభం ఒక వైపు ఒరిగి ప్రమాదకరంగా ఉందని సీపీఐ మండల కార్యదర్శి మనోహర్ బాబు, వెంకటరమణ రమణ, సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో విద్యుత్ స్తంభం ఒరిగి ఏ క్షణమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందిని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.