కడప జిల్లాలో వివిధ కార్పొరేషన్ ల ద్వారా మొత్తం 4998 యూనిట్లకు రూ. 80. 15 కోట్ల లక్ష్యంతో స్వయం ఉపాధి అవకాశాలను అందించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కడప కలెక్టరేట్ లో వివిధ కార్పొరేషన్ల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు స్వయం ఉపాధి, రుణ సహాయ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వయం ఉపాధి అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.