కడప: "ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి"

81చూసినవారు
కడప: "ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి"
విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, క్రమశిక్షణతో అత్యున్నత స్థాయికి ఎదగాలని కడప మహిళా పీఎస్ సీఐ జి. ఈదురు బాషా అన్నారు. గురువారం కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కడప నగరంలోని గాంధీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్ధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్ధి దశ నుండే క్రమశిక్షణతో అత్యున్నత స్థాయికి ఎదిగేలా భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మహిళా పీఎస్ సీఐ విద్యార్థులకు సూచించారు.

సంబంధిత పోస్ట్