ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలోని పబ్బాపురం వద్ద జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి కలిసి పరిశీలించారు. ప్రాంగణంలోని మైదాన అభివృద్ధి, వేదికలు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి ఆయా ఏర్పాట్లు సమయానికి పూర్తి కావాలని అన్నారు.