యోగి వేమన విశ్వవిద్యాలయం డీన్ గా విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర ఆచార్యులు పి. చంద్ర ఓబుల్రెడ్డిని నియమించారు. గురువారం విశ్వవిద్యాలయంలోని వీసీ చాంబర్ లో ఆచార్య చంద్ర ఓబుల్రెడ్డికి ఉపకులపతి ఆచార్య
కె. కృష్ణారెడ్డి, ఇన్-చార్జ్ కులసచివులు, ప్రధానాచార్యులు ఎస్. రఘునాథరెడ్డితో కలసి నియామకపు పత్రాన్ని అందజేశారు. ఈ స్థానంలో పనిచేసిన కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ ఏజీ దాము పదవీకాలం ముగిసింది.