రామసముద్రంలో తల్లిపాల వారోత్సవాలపై తల్లులకు అవగాహన

53చూసినవారు
బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని రామసముద్రం పిహెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లీలా తెలిపారు. గురువారం కెసి పల్లి అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల పై బిడ్డల తల్లులకు అవగాహన కల్పించారు. అప్పుడే పుట్టిన బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలే పట్టించాలన్నారు. డబ్బా పాలు తాపడం వలన రోగ నిరోధక శక్తి తగ్గి బిడ్డల ఎదుగుదలకు నష్టమన్నారు. ముర్రు పాలు బిడ్డకు అండతో పాటు మేధాశక్తి పెరిగి శారీరక దృఢత్వం వస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్