కరెంటు లేక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల అవస్థలు

73చూసినవారు
మదనపల్లె పట్టణంలోని సర్వ బోధన ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ లేక గర్భిణులు, రోగులు, తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి దాదాపు 3 గంటల పాటు మదనపల్లెలో విద్యుత్ సరఫరా
నిలిచిపోయింది. మదనపల్లె 400కేవీ పవర్ హెడ్ ట్రిప్ అవడంతో ఈ పరిస్థితి నెలకొందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ఆస్పత్రిలో జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో ఉక్కపోతకు రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్