మదనపల్లి పట్టణ పరిధిలోని శాంతి భద్రతల దృష్ట్యా రాత్రి 10: 30 గంటలలోపే అన్ని హోటళ్లు, దుకాణాలు మూసి వేయాలని డీఎస్పీ మహేంద్ర మంగళవారం తెలిపారు. కొన్ని ఆసాంఘిక కారణాల నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. వ్యాపార యాజమాన్యాలు ప్రతి ఒక్కరూ పోలీస్ సిబ్బందికి సహకరించాలన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.