ఎస్సీ , ఎస్టీ , బీసీ హాస్టల్లలోని సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి ప్రకాష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మదనపల్లిలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయని, నీటి సమస్య, నాసిరకమైన భోజనం మొదలైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిషోర్, మోహన్ రాజు, పురుషోత్తం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.