ముంబై-చెన్నై జాతీయ రహదారి పనుల్లో పనిచేస్తున్న ప్రకాశం జిల్లా వాసి, బి.కొత్తకోట మండలానికి చెందిన అభిలాష (32)శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తుమ్మనగుట్ట వద్ద కేసీవీఆర్ ప్రాజెక్టులో క్వాలిటీ సర్వేయర్గా పనిచేస్తున్న అతడు, గదిలో ఫ్యానుకు ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.