రామసముద్రం మండలం వైసీపీ అధ్యక్షుడిగా మాజీ సింగిల్ విండో ఛైర్మన్ పి. కేశవరెడ్డిని నియమిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వుల మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతం కోసం అందరి సహకారంతో కృషి చేస్తానన్నారు.