మదనపల్లెలో బుధవారం రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు రహదారి నియమాలు పాటించాలని కోరుతూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వాహనాలు నడిపే సమయంలో శిరస్రానాలు ధరించాలని రవాణా శాఖ అధికారులు అశోక్ ప్రతాప్, శివలింగయ్య, శ్రీహరి సూచించారు. అనంతరం బెంగళూరు బస్టాండ్లో విద్యార్థినులు మానవహారం నిర్వహించారు.