ప్రజల సమస్యలు పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశించారు. శుక్రవారం మదనపల్లె పట్టణ, రూరల్ పరిధిలో ఎమ్మెల్యే అన్నిశాఖల అధికారులతో కలసి పర్యటించారు. స్థానిక ప్రజలు సమస్యలపై ఎమ్మెల్యేకు అర్జీలు అందజేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.