విధులు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ములకల చెరువు ఎస్ఐ గాయత్రీ, తంబళ్లపల్లె ఎస్ఐ లోకేష్రెడ్డి, ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్లపై అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సోమవారం క్రమ శిక్షణా చర్యలు తీసుకున్నారు. రాజంపేట డీఎస్పీ కార్యాలయానికి లోకేష్రెడ్డి, రాయచోటి కార్యాలయానికి గాయత్రీ, మదనపల్లె కార్యాలయానికి దిలీప్కుమార్లను అటాచ్ చేస్తూ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.