బహుజన సమాజ్ పార్టీ మైదుకూరు నియోజకవర్గ అధ్యక్షురాలు బేబీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194 వ జయంతి ఉత్సవాలను స్థానిక ఎస్టి కాలనీ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ ఛార్జ్ సగిలి గుర్రప్ప మాట్లాడుతూ.. శూద్ర కులాలకు చదువులను అందించిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని అన్నారు.